RR: రంజాన్ వేడుకను శాంతియుతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకను నిర్వహించాలని కోరారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.