SDPT: బెజ్జంకి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే గుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని నిరంతరం వినియోగించుకోవాలని సూచించారు. వాటి ద్వారా తల్లి, శిశు ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. పిల్లల బరువు, ఎత్తును క్రమంగా పరిశీలించాలని చెప్పారు.