రేషన్కార్డులు ఉన్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి ఒకేసారి రేషన్ ఇవ్వాలని ప్రకటించింది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది.