JGL: ధర్మపురి మండలంలోని జైనలో గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో 10 గొర్రె, మేక పిల్లలు మృతి చెందాయి. సంబెట గంగాధర్ వీటిని తన పాక వద్ద చుట్టూ కట్టిన జాలీలో వదిలాడు. కుక్కలు జాలి కింది నుంచి లోపలికి చొరబడి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆరు గొర్రె, నాలుగు మేక పిల్లలు మృతి చెందగా రెండు గొర్రె పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.