KNR: కరీంనగర్ రూరల్ మండలంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి. నర్సింహారావును జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు మాసం సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజల సమస్యలపై చర్చించి, పారదర్శకంగా సేవలు అందించాలని కోరగా, సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.