NRML: రంజాన్ పండుగ సందర్భంగా భైంసాలో ఇవాళ భూసార్ బీట్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురియా నాయక్ తెలిపారు. పండుగ సెలవు ముగిసిన అనంతరం మార్చి 23 నుంచి భూసార్ బీట్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.