సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ను శుక్రవారం సోమందేపల్లి ముస్లింలు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సోమందేపల్లిలో జరగనున్న రంజాన్ పండుగ సందర్భంగా ర్యాలీగా ఈద్గా వద్దకు వెళ్లనున్న నేపథ్యంలో తగిన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్సైని కోరారు. దీనిపై అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు.