MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో నిర్వహించే వారసంత వేలం పాటను నిర్వహించనున్నామని ఆ గ్రామ సర్పంచ్ అనూష రాజేష్, కార్యదర్శి శ్రావణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికి గ్రామంలో నిర్వహించే వారసంత వేలంపాట మంగళవారం మ.2:30 గంటలకు నిర్వహించనున్నామని వెల్లడించారు. ధరావత్ సొమ్మును చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు.