NGKL: పదర మండలం రాయలగండి క్షేత్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. ఈ వేడుకలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణంలో తన వంతుగా సొంత నిధులు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఆహ్వానించిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.