PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ మంథని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. అలాగే పట్టణంలో నిర్మాణంలో ఉన్న సంగీత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు తనిఖీ చేశారు.