NGKL: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి, గుండాల, కొట్ర గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. పశువుల షెడ్లు, కూరగాయల తోటలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తోటల నిర్వహణపై రైతులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. గుండాల శివాలయంలోని శానిటరీ కాంప్లెక్స్ను కూడా తనిఖీ చేశారు.