KMM: మధిరకి చెందిన కనకమ్మ అనే వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును పోలీసులు ఆమెకు అందజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు బ్లూకోట్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం టీ తాగేందుకు వెళ్లిన సమయంలో ఆమె నగదును రోడ్డుపై జారవిడుచుకుందని గుర్తించారు. నగదు తీసుకున్న వ్యక్తిని గుర్తించి అతడి నుంచి స్వాధీనం చేసుకుని వృద్థురాలకి అందజేశారు.