MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆయిళ్ల మల్లేష్(55)శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది నేత్రాలను సేకరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.