నంద్యాల వైసీపీ నాయకుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి బైక్ ప్రమాదంలో గాయపడగా, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆయనను శుక్రవారం పరామర్శించారు. నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.