SDPT: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సమత హెచ్చరించారు. బుధవారం మిరుదొడ్డి మండలం అల్వాల చెప్పాల కూడలి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్,ఆర్సీ కలిగి ఉండాలని,హెల్మెట్ ధరించాలని సూచించారు.