WGL: నెక్కొండ మండల తాహసీల్దార్కు శ్రీరామ్ దళ్ తెలంగాణ శాఖ వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘ నాయకుడు వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబర్ 6, 66లో ఉన్న దేవాదాయ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దేవాలయ ఆస్తుల రక్షణ సమాజ బాధ్యత అని పేర్కొంది.