MDCL: వేగవంతమైన పట్టణీకరణ వల్ల భూ వనరులపై ఒత్తిడి పెరిగిందని HYDRAA కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన జలాశయాలు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. JNTUHలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దాదాపు 16 శాతం జలాశయాలు ఆక్రమణలకు గురయ్యాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరు వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు.