SRD: నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని మంత్రి దామోదర్ నివాసం ముందు ఆశా వర్కర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విశాలాక్షి మాట్లాడుతూ… నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ధర్నాలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.