NLG: తెలంగాణ ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలకు విప్ హోదాలో మరిన్ని సేవలు అందిస్తానని వేడుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనతోపాటు ఉన్నారు.