VZM: మొక్కజొన్నలు మద్దతు ధరకు మార్క్ పెడ్ ద్వారా ప్రభుత్వం కొనాలని కోరుతూ ఈనెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంబాబు చెప్పారు. ఇవాళ రాంబాబు గజపతినగరంలో మాట్లాడుతూ.. దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేయడం వలన మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.