KKD: గండేపల్లి మండలం రామయ్య పాలెంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. సినిమా చూసి బైక్పై వస్తున్న చందు, మణికంఠ, కిషోర్లు ఆటోను తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చందు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.