E.G: నార్త్ జోన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ ఆదేశాల మేరకు కోరుకొండ సీఐ మూర్తి ఆధ్వర్యంలో గ్రామాల్లో శాంతి భద్రత కోసం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ గురువారం తెలిపారు. కోరుకొండ, గోకవరం మండలాల్లో జరుగుతున్న జాతరల్లో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.