NRPT: గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన ట్రైనీ కలెక్టర్ బొర్ర రవితేజను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఉగాది సందర్భంగా స్వగ్రామానికి రాగా, బాలుర హాస్టల్ వార్డెన్ యాదయ్య విద్యార్థులతో కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఏకే స్పోర్ట్స్ ఫౌండర్ అంజి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.