విశాఖకు చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ను ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా పురస్కారం అందుకున్నారు. కిరణ్ కుమార్ స్నేక్ కేర్ సొసైటీ ద్వారా ఇప్పటికి సుమారు 35 వేలకు పైగా పాములను రక్షించారు. రెండు సార్లు పాము కాటుకు కూడా గురి అయ్యి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.