MNCL: సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ ఆర్థికంగా నష్టపోతుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్లు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై నిర్వహించిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.51 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో భవిష్యత్తులో సంస్థ నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.