NRPT: నర్వ మండలం యాంకి గ్రామానికి చెందిన వెంకటేష్, తిరుపతయ్య తమ తల్లిదండ్రులు కీ.శే.చెన్నమ్మ, హన్మంతు జ్ఞాపకార్థం జక్కన్నపల్లి గ్రామానికి దాదాపు రూ.40 వేల విలువైన బెంచీలను ఇవాళ విరాళంగా అందజేశారు. జక్కన్నపల్లి సర్పంచ్ అనిత వినతికి స్పందించి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.