HNK: ఐనవోలు మండలం ములకలగూడెం జరిగిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన జక్కుల రాజు గురువారం మొలకలకుంట చెరువులో గొర్రెలను కడుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనపై ఆయన భార్య జక్కుల రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.