VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ముద్దాడ శ్రియాన్ సత్తా చాటాడు. మొన్నవచ్చిన సైనిక్ స్కూల్ ఫలితాల్లో సదరు విద్యార్థి ఎన్నికయ్యాడు. అయితే, నిన్న విడుదలైన నవోదయ ఫలితాల్లో కూడా మెరిశాడు. మొత్తం వంద మార్కులకు గానూ 86.25 మార్కులు సాధించి 399వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. దీంతో శ్రియాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.