KMM: ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి జూబ్లీహిల్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ దంపతులు తమ గోత్ర నామంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతంరం వారికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.