ATP: పెద్దపప్పూరు మండలం షేక్ పల్లి గ్రామంలో యువ రైతు లోకేశ్ రెడ్డికి చెందిన 3 ఎకరాల మొక్కజొన్న పంట బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలవాలింది. 20 రోజుల్లో పంట చేతికొస్తుందని ఎంతో ఆశించిన ఆ రైతుకు అకాల వర్షం శాపంగా మారింది. గురువారం వ్యవసాయ అధికారులు నేలవాలిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.