WNP: పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి గ్రామంలో శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అండర్ 18 కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ గ్రామ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి తెలిపారు. కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఈనెల 23 తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతికి రూ.8000, రెండవ బహుమతికి రూ.5000 ప్రకటించినట్లు తెలిపారు.