RR: ఉగాది పర్వదినాన షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ బసవయ్యల ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు.