NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు గోదావరి జలంతో దేవతలకు గురువారం భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయాల్లో పంచాంగ శ్రవణం విని, ఉగాది పచ్చడిని స్వీకరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గంగాజలంతో అభిషేకం చేయడం విశేషం.