మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ దేవస్థానం గేటు వద్ద ఓబులాయపల్లి గ్రామస్తులు గురువారం ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఉగాది పండుగ సాంప్రదాయం సందర్భంగా ప్రజలకు పచ్చడి పంపిణీ చేశామన్నారు. ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించామన్నారు.