KNR: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకరపట్నం మండల ప్రజలకు ఎస్సై శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. పండుగ వేళ ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరారు. పండుగ సంతోషం విషాదంగా మారకుండా స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.