BDK: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున అర్చకులు ఇవాళ ఆహ్వానం అందజేశారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ.వో దామోదర్ రావు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.