SRD: మనూరు మండలం బోరంచ శివారు మంజీరా నది తీరంలో వెలిసిన నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం తెలుగు ఉగాది పండుగను జరుపుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడిని పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఉగాది పచ్చడిని భక్తులకు వితరణ చేశారు. ఇందులో అర్చకులు సిద్దయ్య, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ ఉన్నారు.