NGKL: వెల్దండ మండలం అజిలాపూర్లో బుధవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కేశమోని కర్ణయ్యకు చెందిన ఎద్దు పొలం పక్కన ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. లక్ష విలువ ఉంటుందన్నారు. తమ ఎద్దు మరణించడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ వారు న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరారు.