WGL: నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం’ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.