MDCL: ఇంటర్ గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చేయడం కోసం ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ప్రారంభమైనట్లు ఉప్పల్ అధికారి రాములు తెలిపారు. టెన్త్ పూర్తి చేసిన వారు, టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 3వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.