JGL: మెట్పల్లి వ్యవసాయ మార్కెట్కు వరుసగా సెలవులు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈరోజు 19 తేదీతో పాటు మార్చి 20న కూడా మార్కెట్ యార్డ్కు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా మార్చి 21 రంజాన్, 22 ఆదివారం కావడంతో పసుపు కొనుగోళ్లు మార్చి 23 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రైతులు, కొనుగోలుదారులు గమనించాలని సూచించారు.