మోత్కూర్, ఆత్మకూర్, గుండాల, అడ్డగూడూరులో ఉగాది పండుగ సందర్భంగా మాంసం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. మెయిన్ రోడ్డులో మటన్ కొనేందుకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం సంతరించుకుంది. రోడ్డుకి ఇరువైపులా జనాలు నిండిపోవడంతో రద్దీగా మారింది. కిలో మటన్ రూ.800 ఉందని వినియోగదారులు చెబుతున్నారు.