SDPT: నంగునూరు మండలం నర్మెట వద్ద ₹300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు హెలిప్యాడ్, బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మార్చి 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మహోత్సవం (రైతు మేళా) నిర్వహించనున్నారు. కలెక్టర్ కే. హైమావతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.