మంచిర్యాల పట్టణం లక్ష్మీ నగర్లో అరుదైన పక్షి తారసపడింది. సంతోశ్ కుమార్ తన ఇంటి సమీపంలో గాయంతో పడి ఉన్న పక్షిని చూసి ఏఐ సహకారంతో అరుదైన పక్షి జాతికి చెందిందని తెలుసుకున్నారు. వెంటనే స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రాత్రి కురిసిన వర్షానికి గాయపడిన పక్షికి చికిత్స అందించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.