HNK: పరకాల పట్టణంలోని ఈద్గా మసీదులో నిన్న సాయంత్రం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని “మడికొండ బ్రదర్స్” ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా ఏర్పాటు చేశారు. TPCC SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్ ఛైర్మన్ డా. శ్రీను మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాస దీక్ష భక్తిశ్రద్ధలతో పాటించే ముస్లిం సోదరులకు ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఇవ్వడం అల్లా కల్పించిన అవకాశమని అన్నారు.