KNR: చొప్పదండి మండలంలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయం జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు స్వామివారి గుట్టపైకి చేరిక, 22న కళ్యాణోత్సవం, 23న బండ్లు, జాతర మహోత్సవం జరుగుతాయి. భక్తుల కోసం నీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు.