KMR: గాంధారి మండలం మేడిపల్లిలో మత సామరస్యం వెల్లివిరిసింది. మసీదు కమిటీ తరఫున బుధవారం సాయంత్రం హనుమాన్ మాలధారులకు రామాలయంలో భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి పూజలు చేశారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, అందరూ ఐక్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాలధారులు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.