KMM: ఏన్కూరు మండలం ఆరికాయలపాడు గ్రామానికి చెందిన ఏలుగోటి నరేందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు అందించిన సమాచారంతో, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే ఇవాళ చరవాణి ద్వారా మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.