TG: అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘2023లో మీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చాం.. 2029లోనూ అదే పునరావృతమవుతుంది’ అని హెచ్చరించారు. ‘నేను స్వశక్తితో పైకి వచ్చాను. మీరు నా కాలిగోటికి కూడా సరిపోరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఏకమై వచ్చినా ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.