కర్నూలు నగర ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. చేదు అనుభవాలను మర్చిపోతూ.. ఆత్మీయత అనుబంధాలను పెంచుకుంటూ జీవించాలని తెలియజేసే పండగ ఉగాది అని అన్నారు.